మాస్ మహారాజ్ తో కలిసి నటించనున్న పాయల్ రాజ్ పుత్

  • November 1, 2018 / 06:10 AM IST

ఈ ఏడాది చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం అందుకున్న సినిమాల్లో “ఆర్‌ఎక్స్ 100” ఒకటి. నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ మూవీ బడ్జెట్ ని రెండురోజుల్లో రాబట్టి 20 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ భాగం ఎక్కువగా ఉంది. ఆమె రొమాన్స్, పెర్ఫార్మెన్స్ అదిరిపోయాయని కితాబు ఇచ్చారు. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ లకు ఉండే క్రేజ్ సొంతం చేసుకుంది. దాంతో పాయల్ రాజ్ పుత్ డేట్స్ కోసం చాలామంది దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. అనేక కథలు విన్న పాయల్ కొత్త దర్శకుడు భాను శంకర్ చెప్పిన కథ, తన రోల్ నచ్చడంతో ఒకే చెప్పినట్లు తెలిసింది. తెలుగు చిత్రం కంటే ముందు తమిళంలో ఓ మూవీ చేస్తోంది.

అలాగే “మిస్టర్ అండ్ మిసెస్ 420 రిటర్న్స్” అనే పంజాబీ చిత్రంలో నటిస్తోంది. తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. విఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ నటించనున్న డిస్కో రాజా చిత్రంలో పాయల్ ఒక హీరోయిన్ గా సెలక్ట్ అయింది. ముగ్గురు హీరోయిన్లుకు ప్రాధాన్యం వున్న ఈ చిత్రంలో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నాబా నటేష్ ను మరొక హీరోయిన్ గా ఎంపిక చేశారు. డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లన్న సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ పోషించనున్నట్టు తెలిసింది. రవితేజ, పాయల్ జోడీ మంచి వినోదాన్ని పంచడం గ్యారంటీ అని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.s

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus