Prabhas: పీపుల్ మీడియా .. ప్రభాస్ కి మరో హోమ్ బ్యానర్ అయిపోతుందా?

  • June 2, 2023 / 12:51 AM IST

ఎం.ఎల్. ఎ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. ఆ చిత్రం తర్వాత గూఢచారి, ఓ బేబీ, వెంకీ మామ వంటి హిట్ సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. అటు తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్,ప్రభాస్ వంటి బడా హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థతో కలిసి సినిమాలు చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు.

అయితే ఇప్పుడు ప్రభాస్ (Prabhas) టయ్యప్ అయ్యారేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. దానికి నిర్మాతలు పీపుల్ మీడియా వారే. అలాగే ఆదిపురుష్ తెలుగు హక్కులు కూడా పీపుల్ మీడియా వారికి ఇప్పించాడు. అలాగే ఇప్పుడు మరో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాకుండా.. ప్రభాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రూపొందే సినిమాల కథలు కూడా వింటున్నట్టు సమాచారం.

ఏ కథకి ఏ హీరో సూట్ అవుతాడు అనే ఐడియాస్ కూడా ప్రభాస్ ఇస్తున్నట్టు సమాచారం. ఇక సినిమాల ఈవెంట్ లకు కూడా ప్రభాస్ ప్రెజెన్స్ ఉంటుంది. సో యూవీ క్రియేషన్స్ తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కూడా ప్రభాస్ కు హోం బ్యానర్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ సినిమాలు ఇదే ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. ప్రాజెక్ట్ కే అయితే 2024 జనవరిలో రిలీజ్ కాబోతుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus