టైమ్ ని కాకుండా టైమింగ్‌ ని నమ్ముకున్న పూజా హెగ్డే

  • July 2, 2018 / 08:01 AM IST

ముకుంద సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. “ఒక లైలా కోసం”లో కూడా చక్కని నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో “మొహెంజొ దారో” చిత్రంతో అడుగుపెట్టింది. ఈ సినిమా తీవ్ర నిరాశపరచడంతో టాలీవుడ్ కే వచ్చేసింది. ఈసారి గ్లామర్ డోస్ పెంచింది. దువ్వాడ జగన్నాథం లో బికినీ అందాలతో అందరినీ పడగొట్టేసింది. ఇక రంగస్థలంలో జిగేల్ రాణి అంటూ ఓ ఊపు ఊపింది. దీంతో వరుసగా ఆమెకి ఆఫర్లు వచ్చాయి. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబులతో కలిసి నటించే అవకాశం అందుకుంది. టాలీవుడ్ లోనే కాదు. బాలీవుడ్ నుంచి కూడా పిలుపు అందుకుంది.

అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న “హౌస్‌ఫుల్‌ 4 “లో పూజా హీరోయిన్ గా ఖరారు అయింది. ఇది పూర్తి కామెడీ చిత్రం. ఈ తరహా కథలో నటించడం పూజకి ఇదే తొలిసారి. అందుకే డీజే బ్యూటీ కంగారు పడుతోంది. అయినా మంచి అవకాశం…ఎలాగైనా నిరూపించుకోవాలనే ధీమాతో రెడీ అవుతోంది. ఈ సినిమా గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ ”నా తొలి కామెడీ చిత్రమిది. నా చుట్టూ ఎంతోమంది గొప్పనటులు ఉన్నారు. వాళ్లకు దీటుగా నటించే ప్రయత్నం చేస్తాను. టైమింగ్‌ అనేది కామెడీకి చాలా కీలకం. ప్రేక్షకుల్ని నవ్వించడం అంటే మాటలు కాదు. పాత్రలోకి దూరిపోయి ప్రేక్షకుల్ని నవ్వించగలగాలి”అని చెప్పింది పూజ. ఈ కొత్తరోల్ బాగా చేస్తే తెలుగులోనూ నవ్వించే పాత్రలు అందుకోవడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus