Pooja Hegde: మూడేళ్లు పూర్తి చేసుకున్న అలా వైకుంఠపురం… జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పూజ హెగ్డే!

  • January 15, 2023 / 11:45 AM IST

దక్షిణాది ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి పూజా హెగ్డే గత ఏడాది మాత్రం వరుస పరాజయాలను ఎదుర్కొంది. గత ఏడాది ఈమె నాలుగు భారీ బడ్జెట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో ఈమెను ఐరన్ లెగ్ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.కెరియర్ మొదట్లో కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి ఈమెకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత సినిమాతో మంచి హిట్ అందించారు.

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ఈమె తిరిగి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించారు.ఇక ఈ సినిమా కూడా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. ముఖ్యంగా ఇందులో ఈమె అమూల్య పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమా అనంతరం పూజా హెగ్డే బుట్ట బొమ్మగా కూడా పేరు సంపాదించుకుంది.ఈ సినిమాలో బుట్ట బొమ్మ సిగ్నేచర్ మూమెంట్ ద్వారా పూజా హెగ్డే ఎంతో ఫేమస్ అయ్యారు

తద్వారా ఈమె పేరు కూడా బుట్ట బొమ్మగా మారిపోయింది. ఇలా ఈ సినిమా విడుదలై మూడు సంవత్సరాలు పూర్తి కావడంతో పూజ హెగ్డే సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి, ఈ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె అమూల్య పాత్ర గురించి స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అమూల్య పాత్ర మూడు సంవత్సరాల క్రితం పుట్టింది.

ఈ పాత్ర నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమే.మూడేళ్ల వేడుకలను జరుపుకోవడానికి అలా వైకుంఠపురం సిద్ధంగా ఉంది అంటూ ఈమె ఈ సినిమా గురించి గుర్తుచేసుకొని సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఇక ఈమె సినిమాల విషయానికొస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు సంక్రాంతి అనంతరం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus