రెమ్యూనరేషన్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న పూజా హెగ్డే

  • March 19, 2020 / 11:52 AM IST

ఒక మూడేళ్ళ క్రితం రకుల్ ప్రీత్ సినిమాకి కోటి రూపాయలు తీసుకొంటుంది అనేసరికి షాక్ అయ్యారు జనాలు. అంతకుముందే ఇలియానా సినిమాకు కోటి రెమ్యూనరేషన్ తీసుకొని సెన్సేషన్ క్రియేట్ చేసినప్పటికీ.. అది కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమైంది. కానీ.. రకుల్ మాత్రం ఆల్మోస్ట్ ఇప్పటివరకు నటించిన ప్రతి తెలుగు-తమిళ చిత్రానికి కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకొంది. ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి మిగతా హీరోయిన్లు ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం లభించలేదు.

అయితే.. కేవలం రెండు సినిమాల సక్సెస్ లతో ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది పూజా హెగ్డే. “దువ్వాడ జగన్నాధం, రంగస్థలం” చిత్రాలతో అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. “అరవింద సమేత”కు కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొన్న పూజా.. రీసెంట్ గా “అల వైకుంఠపురములో” చిత్రానికి ఏకంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ అందుకొంది. పూజను హీరోయిన్ గా తీసుకొంటే.. తమిళ, హిందీ శాటిలైట్ & డబ్బింగ్ రైట్స్ కు కూడా ఆమె ఇమేజ్ ఉపయోగపడుతుండడమే నిర్మాతలు ఆమెకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతుండడానికి కారణం. అయితే ఇప్పుడు బాలీవుడ్ ఆమెకు 4 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తుండగా.. తెలుగులో 2.5 కోట్ల వరకూ వచ్చే అవకాశాలున్నాయి. ఈ లెక్కన పూజా హెగ్డే టాలీవుడ్ లో టాప్ పెయిడ్ హీరోయిన్ అని డిక్లేర్ చేయడంలో ఎలాంటి సందేహం లేదు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus