అది నా అదృష్టంగా భావిస్తున్నాను : పూజా హెగ్దే

  • May 7, 2019 / 12:49 PM IST

‘మహర్షి’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అయ్యింది పూజా హెగ్దే. ఇప్పటి వరకూ తనకి భారీ హిట్టయితే లేదు. ‘అరవింద సమేత’ చిత్రం సూపర్ హిట్ టాక్ వచ్చినా బ్రేకీవెన్ అయితే కాలేదు. అయినప్పటికీ ఈ అమ్మడికి ఆఫర్లు మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అవి కూడా స్టార్ హీరోల సరసనే వస్తుండడం విశేషం. ఇక భారీ హిట్టందుకోవడం కోసం ఈ అమ్మడు ఆశలన్నీ మహేష్ ‘మహర్షి’ పైనే పెట్టుకుంది. ఇది మహేష్ కు 25 వ చిత్రం కాబట్టి చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కించారు. మే 9 న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇక ‘మహర్షి’ చిత్రం ప్రమోషన్లలో కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది పూజా హెగ్దే.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ ఒకేరోజున ముగ్గురు స్టార్ హీరోల షూటింగ్స్ లో పాల్గొన్నానని చెబుతుంది. పూజా మాట్లాడుతూ.. ” వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం నా అదృష్టం. ఎన్టీఆర్ తో చేసిన ‘అరవింద సమేత’ తో నాకు మరింత క్రేజ్ వచ్చింది. మహేశ్ తో చేసిన ‘మహర్షి’ మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. ఇక ప్రభాస్ తో చేస్తున్న సినిమా సెట్స్ పై వుంది. ఒకానొక సమయంలో ఒకే రోజున ఈ ముగ్గురు స్టార్ హీరోల షూటింగ్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. ఉదయం 7 నుండీ 12 వరకూ ఎన్టీఆర్ .. మధ్యాహ్నం 2 నుండీ 6 వరకూ మహేష్ తో .. రాత్రి 9 నుండీ ఉదయం 2 వరకూ ప్రభాస్ తో కలిసి పనిచేశాను. ఇలాంటి అవకాశం రావడం కూడా నా అదృష్టంగానే భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus