మళ్ళీ ట్వీట్ తో సంచలనం సృష్టించిన పూనమ్ కౌర్..!

  • March 16, 2020 / 04:41 PM IST

‘మాయాజాలం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్…! కళ కళలాడే మొహం కలిగి ఉండే ఈ భామకి.. మొదట్లో ఆఫర్లు బాగానే వచ్చాయి. ‘ఒక వి చిత్రం’ ‘శౌర్యం’ ‘వినాయకుడు’ ‘గణేష్ జస్ట్ గణేష్’ ‘గగనం’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే నటిగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈమెను దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు. అటు తరువాత గట్టి ప్రయత్నాలు చేస్తే ‘శ్రీనివాస కళ్యాణం’ ‘నాయకి’ ‘నెక్స్ట్ ఏంటి’ ‘ఆడు మగాడ్రా బుజ్జి’ వంటి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది కానీ అవి ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. ఇది పక్కన పెడితే ఈమె.. అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తుంటుందని ఆయన అభిమానులు ఈమె పై మండిపడుతుంటారు. రియాక్ట్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కాబట్టి ఈమె ట్వీట్ లు బాగా వైరల్ అవుతుంటాయి.

ఇప్పుడు కూడా ఈమె ఓ ట్వీట్ చేసింది.. ‘డబ్బు హోదా ఉన్న వాడు రాజు అవ్వొచ్చు. కానీ ప్రేమ త్యాగం న్యాయం కోసం పోరాడే వ్యక్తి వీరుడవుతాడు. రాజులు శాసిస్తారు. వీరులు మిమ్ములను కాపాడుతారు. శాసించాలి అని తపన పడే మనిషిలో అహంకారం ఉంటుంది. అందరూ బాగుండాలనే వ్యక్తులలో ప్రేమ వైరాగ్యం ఉంటుంది’ అంటూ ట్వీట్ చేసింది. ఇది కూడా పవన్ పైన పరోక్షంగా సెటైర్ వేసేలానే ఉంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కత్తి మహేష్ కూడా పవన్, పూనమ్ ల సంబంధం గురించి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు కొందరు నెటిజన్లు అసలు ‘నిన్ను ఎవ్వరు మోసం చేశారు పూనమ్?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ‘చెప్పేస్తే ఈమె ట్వీట్ లను ఇంకా ఎవ్వరూ పట్టించుకోరు కదా’ అని సెటైర్లు వేస్తున్నారు. మరి అసలు సంగతి ఏంటో.. పూనమ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో చూడాలి..!

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus