దయనీయంగా మారిన టీవీ నటి పరిస్థితి.. ఎవరైనా కన్నీళ్లు పెట్టాల్సిందే..!

  • May 26, 2021 / 07:25 PM IST

బుల్లితెర పై ‘స్వాతి’ అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి శరణ్య శశి. ఆ సీరియల్ లో ఈమె తన అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది. అటు తర్వాత మలయాళ,తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపింది.అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది. అదే టైములో మలయాళంలో ఈమె నటించిన ఓ సీరియల్ కు గాను ఉత్తమ నటి కేటగిరిలో అవార్డుని కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ నటి చావు బతుకుల మధ్య అల్లాడుతుంది.

ఈ విషయాన్ని శరణ్య స్నేహితురాలు మరియు తోటి నటి అయిన సీమా నాయర్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. శరణ్య మంచి నటిగా రాణిస్తూ బిజీగా గడుపుతున్న టైములో బ్రెయిన్ ట్యూమర్ కు గురైనట్టు ఈమె తెలిపింది. అప్పటి నుండీ ఈమె మంచాన పడిందని.. వైద్య చికిత్స అందుతున్నా కోలుకోలేక పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు శరణ్యకు 11 సర్జరీలు జరిగాయట. అయినప్పటికీ ఆమె కోలుకోక పోగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి నట్టు తెలిపింది.

ఓ వ్యాధి ఈమె వెన్నెముక నుండీ శరీరమంతా పాకుతున్నట్టు వైద్యులు తెలిపారు అని ఈమె చెప్పుకొచ్చింది.అయితే ఇటీవల ఈమె ట్రీట్మెంట్ కు రెస్పాండ్ అవుతుందని వైద్యులు తెలిపినట్టు చెప్పిన సీమా.. అదే టైములో శరణ్య తల్లి, సోదరుడికి కరోనా సోకడంతో హాస్పిటల్ పాలయ్యారని.. దీంతో శరణ్య ఆరోగ్యం మరింత దారుణంగా మారుతుంది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. వచ్చే నెల 3వ తేదీన శరణ్య కు కీమోథెరపీ జరిపించాల్సి ఉందట .. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది అని ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus