మంచి పనికోసం ఒకటైన టాలీవుడ్ స్టార్స్!

  • December 5, 2017 / 02:30 PM IST

ప్రకృతి విపత్తుల సమయంలో షూటింగ్ లకు బ్రేక్ చెప్పి అభిమానుల కోసం తెలుగు నటీనటులు అనేక సార్లు సేవ చేశారు. ఆర్ధిక సాయంతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు తమ కోసం ఒక్కటి కానున్నారు. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఏర్పడి పదేళ్లు దాటిపోతున్నా.. సొంత భవనం అంటూ లేదు. దీనికోసం పలు సార్లు ప్రయత్నించినా ముందుకు అడుగు పడలేదు. నిధుల కొరతతో వాయిదా పడుతూ వచ్చింది.  ఇన్నాళ్ళకి ఈ భవన నిర్మాణానికి దారి దొరికింది. “మా” వద్ద ఉన్న నిధులతో పాటు కొంత ఉమ్మడిగా సేకరించాలని భావిస్తున్నారు. “సొంత భవన కల త్వరలో నెరవేరనుంది. ఇందుకోసం ముమ్మర ప్రయత్నాలు చేపట్టాం” అని మా జనరల్ సెక్రటరీ, సీనియర్ నటుడు నరేష్ చెప్పారు.

ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన కర్టెన్ రైజర్ కార్యక్రమం జరగబోతోంది. పలువురితో ప్రత్యేక ప్రదర్శనలు.. సీనియర్ నటులకు సన్మానాలతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి అలనాటి స్టార్స్ కృష్ణ, కృష్ణంరాజులు మద్దతు పలికారు. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు సైతం వంతు సహాయం అందిస్తామని ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు కూడా తమ వంతు సపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఈ నెల 10 న జరగబోయే కార్యక్రమానికి రామ్ చరణ్, ప్రభాస్ హాజరవుతారని నరేష్‌ వెల్లడించారు. సినీ తారలందరూ ఒకే చోట కనిపిస్తే.. ఆ కార్యక్రమం సూపర్ హిట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus