“శ్రీ వల్లీ” చిత్ర డైరక్టర్ విజయేంద్ర ప్రసాద్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రభాస్

  • January 24, 2017 / 01:31 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించే సినిమా బాహుబలికి కథను అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా మారారు. శ్రీవల్లీ అనే ఓ సైంట్ ఫిక్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. రజత్, నేహా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాత రాజ్‌కుమార్ బృందావనం నిర్మించారు. ఈ ఫిల్మ్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా “శ్రీ వల్లీ” టీమ్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన మాట్లాడిన ఓ వీడియోని యూట్యూబ్లో రిలీజ్ చేశారు.

” ఏ చిత్రమైనా బాగా ఆడాలంటే కథ ముఖ్యం. అలాంటి ఎన్నో మంచి  కథలను రాసిన విజయేంద్ర ప్రసాద్ నాకు లైఫ్ లో గుర్తిండిపోయే బాహుబలి కథను ఇచ్చారు. అటువంటి వ్యక్తి డైరక్ట్ చేసిన “శ్రీ వల్లీ” బ్లాక్ బస్టర్ కావాలి” అని విషెష్ చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus