‘ప్రభాస్ 20’ నిర్మాతల పై ఫ్యాన్స్ ఆగ్రహం…!

  • April 10, 2020 / 06:09 PM IST

‘బాహుబలి’ చిత్రం నుండీ ప్రభాస్ అభిమానులు ఆయన సినిమాలు… అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూనే వస్తున్నారు. రెండేళ్లకు ఓసారి సినిమా ఇస్తున్నాడు ప్రభాస్. కానీ ఆ చిత్రాల నిర్మాతలు మాత్రం కనీసం అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు అంటూ మొదటి నుండీ ఫైర్ అవుతూనే వస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ తన స్నేహితులైన ‘యూవీ క్రియేషన్స్’ వారితో ‘సాహో’ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఆ చిత్రం ప్రారంభమైనప్పటి నుండీ ఎక్కువగా వారు ఎక్కువగా అప్డేట్స్ ఇచ్చేవారు కాదు అంటూ తెగ ట్రోల్ చేసేవారు ప్రభాస్ ఫ్యాన్స్.

ఎట్టకేలకు ‘సాహో’ ప్రయాణం ముగిసింది. ఇక రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో చేస్తున్న ‘ప్రభాస్ 20’ కి ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ వారు నిర్మాతలు అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ కూడా ముగిసింది త్వరలో ఫస్ట్ లుక్ ఇస్తాం అని డైరెక్టర్ రాధా కృష్ణ ట్విట్టర్ లో తెలిపాడు. దీంతో ఉగాది కి ‘ప్రభాస్ 20’ ఫస్ట్ లుక్ ఇస్తారని ఆయన అభిమానులు భావించారు. కానీ ఎటువంటి ఫస్ట్ లుక్ ఇవ్వలేదు.

దీంతో యూవీ క్రియేషన్స్ వారి పై ప్రభాస్ ఫ్యాన్స్ పగ పెట్టేశారు. #BanUVC reations అనే ట్యాగ్ తో వారిని ట్రోల్ చేసి వారు ఇండియా వైడ్ ట్రెండ్ చేసారు.ఇది చూసిన యూవీ వారు…’ఇప్పుడు కరోనా వల్ల చాలా మంది మరణించారు. ఇటువంటి పరిస్థితుల్లో అప్డేట్స్ ఇవ్వాలని…అనుకోలేదు. ఇప్పుడున్న సిట్యుయేషన్ సెట్ అయ్యాక వరుస అప్డేట్స్ ఇస్తాము అని వారు చేతులు దులిపేసుకున్నారు. దీనికి ఏమాత్రం ఏకీభవించని ప్రభాస్ అభిమానులు ‘నీకు ఇదో వంక దొరికిందిరా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus