Prabhas: ప్రభాస్ మూవీ కష్టాలు హోమంతో తీరతాయా..?

  • May 16, 2021 / 09:29 PM IST

స్టార్ హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమాలో నటిస్తుండగా దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మేకర్స్ కు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. సినిమా మొదలైన రోజే ఫైర్ యాక్సిడెంట్ కావడం, సైఫ్ అలీ ఖాన్ వివాదం, ముంబైలో లాక్ డౌన్, హైదరాబాద్ లో కరోనా వల్ల కఠిన ఆంక్షలు అమలు కావడంతో ఆదిపురుష్ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండటం గమనార్హం.

వచ్చే ఏడాది ఆగష్టు నెల 11వ తేదీన ఆదిపురుష్ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రాబోయే రోజుల్లో షూటింగ్ కు ఆటంకాలు ఏర్పడితే ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నారు. అయితే షూటింగ్ మొదలుపెట్టిన ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతున్న నేపథ్యంలో ఆదిపురుష్ మేకర్స్ హోమం లాంటిది చేయించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. శ్రీరామునికి సంబంధించిన కథ కావడంతో ఏదైనా దోషం ఉండవచ్చని నిర్మాతలు ప్రభాస్ తో మాట్లాడి హోమం చేయించబోతున్నట్టు భోగట్టా.

అయితే ప్రభాస్ ఇలాంటివి నమ్ముతారా..? అని కొందరు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించనుండగా ఇంద్రజిత్ పాత్రలో అంగద్ బేడీ, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారు. టీసిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ప్రభాన్ నటిస్తున్న తొలి మైథలాజికల్ ఫిల్మ్ ఇదే కావడం గమనార్హం. ఆదిపురుష్ సినిమా వల్ల మేకర్స్ కు ఎదురవుతున్న కష్టాలు హోమంతో తీరతాయో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus