మొన్న మహేష్ …. ఇప్పుడు ప్రభాస్….!

  • February 29, 2020 / 04:39 PM IST

తెలుగులో ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాదు ఓ గేమ్ ఛేంజర్ మూవీ చేసాడు. అదే సినిమాని హిందీలో కూడా తీసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ క్రమంలో ఇతను పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయాడనే అంతా భావించారు. కాని ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇంతకీ ఏ డైరెక్టర్ గురించి చెప్తున్నానో మీకు అర్థమైందా..? ఎస్ సందీప్ రెడ్డి వంగా..! ఈయన బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు ఎన్నో వివాదాలకి కూడా తెరలేపాడు. ‘కబీర్ సింగ్’ సినిమాలో హీరోయిన్ ను చెంప దెబ్బలు కొట్టే సీన్లు .. మహిళల పై హింస ను ప్రేరేపించేలా ఉన్నాయంటూ కొందరు ఫెమినిస్ట్ లు, హీరోయిన్ లు సందీప్ పై మండి పడ్డారు.. దాంతో ఈ డైరెక్టర్ కు మరింత క్రేజ్ పెరిగింది.

ఇదిలా ఉంటే.. ఒకే చిత్రాన్ని రెండు భాషల్లో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ లు కొట్టినా… ఈ డైరెక్టర్ కి ఏ స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వడం లేదు. మొదట ‘మహేష్ 27’ ను ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తాడు అని అనుకున్నారు. కాని ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. ఇక తాజాగా ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా సినిమా ఫిక్స్ అనుకున్నారు.. కానీ అదికూడా సెట్ అవ్వలేదని ఇటీవల ‘ప్రభాస్ 21’ అనౌన్స్మెంట్ తో తేలిపోయింది. ఎవ్వరూ ఊహించని విధంగా ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో సినిమాని అనౌన్స్ చేసాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ కూడా హ్యాండిచ్చేసినట్టే అని స్పష్టమైంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus