ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ వచ్చేది 2022లోనే

  • May 7, 2020 / 06:44 PM IST

బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఆయనకి జపాన్, మలేసియా వంటి దేశాలలో కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ వరుసగా భారీ సినిమాలనే చేస్తున్నాడు. గత ఏడాది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో విడుదల చేశాడు. ఆ మూవీ 420కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి 2019 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం దర్శకుడు రాధా కృష్ణతో చేస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామా సైతం 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

ఇక కొద్దినెలల క్రితం మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ ఓ భారీ చిత్రం ప్రకటించారు. చాలా కాలంగా పరిశ్రమలో సీనియర్ ప్రొడ్యూసర్ గా ఉన్న అశ్విని దత్ 500కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఆయన పంచుకున్నారు. నాగ్ అశ్విన్ ఓ యూనివర్సల్ స్టోరీ తన వద్దకు తీసుకువచ్చి భారీ బడ్జెట్ మూవీ ప్రభాస్ కరెక్ట్ అన్నారట.

దీనితో అశ్వినీ దత్ ఆ కథను ప్రభాస్ కి వినిపించారట. కథ నచ్చడంతో ప్రభాస్ వెంటనే ఒకే చెప్పారట. ఇక ఈ మూవీని 2020 అక్టోబర్ లో మొదలుపెట్టి, 2022 ఏప్రిల్ లో విడుదల చేయాలన్నది ప్లాన్ అట. కాబట్టి మరో రెండు ఏళ్ళు ఈ సినిమా కోసం ప్రభాస్ లాక్ కానున్నాడు. ఒకవేళ రాధా కృష్ణ తో ఆయన చేస్తున్న మూవీ 2020లో విడుదల అయితే 2021లో ప్రభాస్ నుండి మూవీ ఉండదన్న మాట.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus