‘ప్రభాస్ 21’ కాస్త … ‘జకదేక వీరుడు అతిలోక సుందరి’ టచ్ ఉండేలా ఉందే…!

  • May 11, 2020 / 07:57 PM IST

‘జకదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా వచ్చి 30 ఏళ్ళు పూర్తయిన తరుణంలో … మా బ్యానర్ లో మరో సోషియో ఫాంటసీ తీస్తున్నాం అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో నిర్మాత అశ్వినీ దత్ చెప్పుకొచ్చారు.’మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్… ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న చిత్రం అలాగే ఉంటుంది అని ఆశ్వినీ దత్ తెలిపారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఏకంగా 70 కోట్ల వరకూ ప్రభాస్ పారితోషికం అందుకోనున్నట్టు ఇన్సైడ్ టాక్.

ఇదిలా ఉంటే ప్రభాస్ తో సినిమా తియ్యాలి అని ఎంతో మంది దర్శక నిర్మాతలు ఎదురుచూస్తుంటే.. ప్రభాస్ సింగిల్ సిట్టింగ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పిన కథని ఓకే చేసేసాడు. అయితే ప్రభాస్ ను అంత అలా ఇంప్రెస్ చేసేసిన లైన్ ఏంటి అని అంతా అనుకున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్… ఓ సాధారణ మానవుడికి .. అలాగే దేవకన్యకి జన్మించిన బిడ్డగా కనిపిస్తాడట. మానవుడికి .. దేవకన్యకి జన్మించిన వండర్ కిడ్ కాబట్టి… అతను పెరిగి పెద్దయ్యాక ఎలాంటి అద్భుతాలు చేస్తాడనేదే ప్రధానమైన కథాంశమని తెలుస్తుంది.

పెద్దయ్యాక సూపర్ పవర్స్ ఉన్న కుర్రాడుగా.. అలరించే సీన్లతో ఆ పాత్ర ఉండబోతుందట. సామాన్య మానవుడు… అలాగే దేవకన్య కొడుకు అంటే అందరికీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ లా అనిపిస్తుంది. మరి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ కూడా ఉంటుంది అని ఇన్సైడ్ టాక్. మరి ఆ చిత్రం లైన్ ఎలా ఉండబోతుంది అనే కన్ఫ్యూజన్ ఏర్పడింది.
Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus