ప్రభుదేవా బ్యాక్ టు పెవిలియన్!

  • April 6, 2016 / 11:53 AM IST

మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయి హీరోగా నటించిన ఆఖరి చిత్రం “శంకర్ దాదా జిందాబాద్” తర్వాత తెలుగు చిత్రసీమకు దూరమైన కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ టర్నడ్ డైరెక్టర్ ప్రభుదేవ.. మళ్లీ దాదాపుగా 9 ఏళ్ళ అనంతరం మరో తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కించిన “రౌడీ రాథోర్” లాంటి బ్లాక్ బస్టర్ అనంతరం.. “రామయ్య వస్తావయ్యా, రాంబో రాజ్ కుమార్, యాక్షన్ జాక్సన్, సింగ్ ఈజ్ బ్లింగ్” చిత్రాలతో వరుస పరాజయాలు దక్కించుకొన్న ప్రభుదేవకు.. బాలీవుడ్ లో క్రేజ్ తగ్గింది. అందువల్లే తనకు దర్శకుడిగా జన్మనిచ్చిన తెలుగు చిత్రసీమకు తిరుగు ప్రయాణమయ్యాడని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరి ప్రభుదేవ దర్శకత్వం వహించబోయే సినిమాను ఎవరు నిర్మిస్తారు? ఎవరు నటిస్తారు? వంటి విషయాలు తెలియాల్సి ఉంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus