నయన తార పై మరోసారి ఫైర్ అయిన ప్రభుదేవా భార్య…!

  • April 16, 2020 / 06:45 PM IST

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ రేంజ్ ను అనుభవిస్తున్న నయన తార.. అప్పట్లో ప్రభుదేవ తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే ప్రభుదేవ కి పెళ్ళైన సంగతి కూడా తెలిసిందే. 1995లో రమాలత్ అనే ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు ప్రభుదేవా. ఇతని కోసం మతం కూడా మార్చుకుంది ఆమె. 15 ఏళ్ల పాటు హాయిగా ఉన్న వీరి మధ్య నయన తార వచ్చింది. దీంతో వీళ్ల మధ్యలో గొడవలు మొదలయ్యాయి.

అదే టైములో ప్రభుదేవా కొడుకు కూడా మరణించాడు. దాంతో గొడవలు మరింతగా పెరిగాయి. నయన తారను పెళ్ళి చేసుకోవడానికి కూడా ప్రభుదేవా రెడీ అయిపోయాడు. దీంతో 2011 లో రమాలత్ కు విడాకులు ఇచ్చేసాడు ప్రభుదేవా.ఆమెకు భారీగా ఆస్తులు కూడా ఇచ్చాడని అప్పట్లో టాక్ నడిచింది. తరువాత నయన్, ప్రభు దేవా కూడా విడిపోయారు. అయినప్పటికీ ఇంకా రమాలత్ మాత్రం ఇంకా నయన్ పై ఘాటు కామెంట్స్ చేస్తూనే ఉంది.

‘నయనతార వల్లే నా జీవితం.. కాపురం.. అంతా నాశనమైపోయింది.నా బ్రతుకు రోడ్డున పడింది. నా భర్తను నాకు కాకుండా చేసిన నయనతారను దేవుడు క్షమించడు..కచ్చితంగా శిక్షిస్తాడు. పెళ్లైన మగాళ్ల వైపు చూసే ఇలాంటి ఆడవాళ్లను కఠినంగా శిక్షించాలి. నేనంటే ప్రాణమిచ్చే నా భర్తను నాకు కాకుండా చేసిన నయనతార అంతకంత తన జీవితంలో అనుభవిస్తుంది. 15 ఏళ్లు నా భర్త .. నన్ను దేవతలా చూసుకున్నాడు.. ఇల్లు… పని… తప్ప మరొకటి తెలియని అతనికి నయనతార ఏం మాయ చేసిందో అంటూ మహమ్మారి అంటూ’ మండిపడింది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus