Prashanth Neel: హీరో ఎవరు.. ఎప్పుడు మొదలు.. ఛాన్సెస్‌ ఎవరికి?

  • June 4, 2021 / 02:41 PM IST

కన్నడ చిత్రసీమలో గంధపు చెక్కలాంటి దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ‘కేజీఎఫ్‌’తో ఈ గంధపు చెక్క టాలెంట్‌ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. ఎక్కడ టాలెంటెడ్‌ దర్శకుడు ఉన్నా… వెతికి పట్టుకొచ్చి తెలుగులో సినిమాలు చేయించడం మనవాళ్లకు బాగా తెలిసిన పని. అందుకే ప్రశాంత్‌ నీల్‌ను టాలీవుడ్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ‘సలార్’తో బిజీగా ఉన్నారు ప్రశాంత్‌. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడు. అయితే ఆ తర్వాత కూడా ప్రశాంత్‌ ఇక్కడే ఉంటారు అని తెలుస్తోంది. ఎందుకంటే వరుసగా నిర్మాతలు అడ్వాన్స్‌లు ఇచ్చేస్తున్నారు కాబట్టి. ఈ వరుసలో మరో నిర్మాత కూడా చేరారని సమాచారం.

ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేయాలని టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలందరూ ఎదురుచూస్తున్నారు అనడంతో అతిశయోక్తి లేదు. కారణం ఆయన హీరోకు ఇచ్చే ఎలివేషన్ సీన్స్‌ ఆ రేంజిలో పండుతాయి. దీంతో కచ్చితంగా ప్రశాంత్‌ నీల్‌తో హీరోగా చేయాలని ఫిక్స్ అవుతున్నారు. ప్రభాస్‌ తర్వాత ఎన్టీఆర్‌ చేస్తాడు. ఆ తర్వాత వరుసలో అల్లు అర్జున్‌, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌ ఉన్నారని తెలుస్తోంది. దీంతో వీరి సినిమాలకు నిర్మాతలెవరో తెలియాల్సి ఉంది. అయితే అందులో ఒకరి సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత అని తెలుస్తోంది.

డీవీవీ దానయ్య ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మిస్తున్నారు. అయితే గతంలో చాలా మంది హీరోలకు అడ్వాన్స్‌లు ఇచ్చి పెట్టున్నారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అలా అడ్వాన్స్‌లు తీసుకున్నవారిలో మహేష్‌బాబు, రామ్‌చరణ్‌ ఉన్నారని టాక్‌. కాబట్టి డీవీవీ బ్యానర్‌లో ప్రశాంత్‌ నీల్‌ మహేష్‌బాబు లేదా రామ్‌చరణ్‌ హీరోగా సినిమా ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. లేదంటే వేరే ఇంకెవరైనా హీరో లైన్‌లోకి వస్తారేమో చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus