ప్రశాంత్ నీల్ పై కన్నడ ఫ్యాన్స్ ఫైర్!

  • December 3, 2020 / 06:26 PM IST

ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వెల్లడించిన చిత్రబృందం జనవరి నుండి సినిమా షూటింగ్ మొదలవుతుందని అన్నారు. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే అతడిని ‘వెల్కమ్ యు హోమ్’ అంటూ కర్ణాటకకు ఆహ్వానిస్తూ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ని ఉద్దేశిస్తూ పునీత్ పెట్టిన ఈ పోస్ట్ కన్నడిగులు అసలు నచ్చడం లేదు. ప్రభాస్ ఏమైనా కన్నడ వాడా..? వెల్కమ్ హోమ్ అని ఆహ్వానించడానికి అంటూ పునీత్ పై విరుచుకుపడుతున్నారు కన్నడ నెటిజన్లు.

ఇప్పటికే కన్నడ సినీ ఫ్యాన్స్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మీద చాలా కోపంగా ఉన్నారు. ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేయడానికి చాలా మంది స్టార్లు ఆసక్తి చూపుతున్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తెలుగు స్టార్ హీరోలతో కలిసి పని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే ప్రశాంత్ పై కన్నడిగులు మండిపడ్డారు. కన్నడలో పేరు సంపాదించగానే ఇక్కడ హీరోలు కనిపించకుండా పోయారంటూ అతడిని ట్రోల్ చేశారు.

గెట్ లాస్ట్ ప్రశాంత్ అంటూ ట్విట్టర్ లో ట్యాగ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు. ఆ తరువాత వ్యవహారం సద్దుమణిగింది. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేయగానే.. మరోసారి రచ్చ మొదలైంది. ప్రభాస్ ని వెల్కమ్ చేస్తూ పోస్ట్ పెట్టిన పునీత్ మీద కూడా కోపాన్ని చూపిస్తున్నారు కన్నడిగులు. నిజానికి హీరోలు తమ మార్కెట్ పరిధిని, క్రేజ్ ని పెంచుకోవడానికి ఇతర భాషల్లో సినిమాలు రిలీజ్ చేయడం, నటించడం వంటివి చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ ఆ విషయాన్ని అర్ధం చేసుకోకుండా ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus