Pratik Gandhi: ‘యాత్ర’ సీక్వెల్ కి హీరో దొరికేశాడోచ్!

  • July 2, 2021 / 03:32 PM IST

టాలీవుడ్ దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి సీక్వెల్ తీస్తానని అప్పట్లోనే ప్రకటించాడు మహి వి రాఘవ్. ‘యాత్ర 2’ పేరుతో తెరకెక్కించనున్న ఈ సినిమాలో జగన్ రాజకీయ ప్రస్థానం గురించి చూపించబోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరిగిపోయింది. జగన్ పాత్రలో ఏ నటుడు కనిపిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

‘యాత్ర’ సినిమాలో వైఎస్ఆర్ పాత్రను మమ్ముట్టి పోషించారు. ఇందులో ఆయన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతగా ఇమిడిపోయి నటించారు. ఈసారి జగన్ పాత్రలో ప్రముఖ నటుడు కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. ముందుగా నటుడు అజ్మల్ ను తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ దర్శకుడు మహి వి రాఘవ్ మాత్రం బాలీవుడ్ నటుడిని ఎన్నుకున్నారు. ‘స్కామ్ 1992’లో నటించిన ప్రతీక్ గాంధీని సెలెక్ట్ చేసుకున్నారు. జగన్ పోలికలు, హావభావాలు ప్రతీక్ లో చాలా ఉన్నాయని దర్శకుడు భావిస్తున్నారు.

ప్రతీక్ రాకతో ప్రాజెక్ట్ కి పాన్ ఇండియా అప్పీల్ వస్తుందనేది మరో ఆలోచన. దాదాపు ఆయన్నే ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో వైఎస్ఆర్ చనిపోయిన తరువాత జగన్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడనే అంశాలను చూపించబోతున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus