Bhamakalapam Trailer: రూ.200 కోట్ల గుడ్డు స్టోరీ.. ప్రియమణి హిట్ కొడుతుందా..?

  • February 1, 2022 / 01:40 PM IST

ప్రముఖ నటి ప్రియమణి నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘భామాకలాపం’. అభిమన్యు తాడిమేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఓటీటీ కోసం రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రియమణి వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. కానీ తొలిసారి ఆమె నటించిన సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ వెబ్ ఫిల్మ్ ఫిబ్రవరి 11న ‘ఆహా’లో టెలికాస్ట్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. థ్రిల్లర్, కామెడీ నేపథ్యంలో ఈ ట్రైలర్ సాగింది.

‘నేను వాసన చూసే కూరలో ఉప్పు ఎక్కువైందో.. తక్కువైందో చెప్పేస్తాను.. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. నేను పసిగట్టింది తప్పయ్యే ఛాన్సే లేదు’ అని తన ఇంట్లో పనిచేసే అమ్మాయికి ప్రియమణి చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. కోల్‌క‌త్తా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన రూ.200 కోట్లు విలువైన ఓ గుడ్డు మిస్ అవుతుంది. అది ఎక్కడుందో కనిపెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం రంగంలోకి దిగుతుంది. ఆ గుడ్డుకి ఓ అపార్ట్మెంట్ లో ఉండే హౌస్ వైఫ్ కి సంబంధం ఏంటి..?

అనేదే ఈ సినిమా. ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్, కొన్ని సన్నివేశాలను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమాతో ప్రియమణి మరో హిట్టుని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!


అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus