పూరికి ఎస్ చెప్పిన హీరో ఎవరు..?

  • November 1, 2016 / 08:09 AM IST

సినిమా విడుదలై పది రోజులయ్యిందంటే.. సాధారణంగా ఎవరైనా సినిమా ప్రొమోషన్ లోనో, లాభ నష్టాల లెక్కల్లోనో తలమునకలై ఉంటారు. సరే ఇది హిట్ అయినపుడు సంగతి అనుకుంటే ప్లాప్ అయినవారి పరిస్థితి మరో రకం. డప్పు కొట్టేవారు కొందరైతే కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి పోయేవాళ్లు మరికొందరు. వీటన్నిటికీ అతీతుడు గనుకనే పూరీని డాషింగ్ డైరక్టర్ అన్నారు కాబోలు. విషయానికొస్తే…

కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘ఇజం’ సినిమా అక్టోబర్ 21న విడుదలైంది. అంటే నేటికీ 10 రోజులు మాత్రమే అయింది. అంతలోనే బ్యాంకాక్ చెక్కేశారు పూరి. ఆయన అక్కడికి ఎందుకెళతారో తెలుగు వాళ్ళకే కాదు అక్కడివారికి తెలుసు. హైదరాబద్ లో కథ ఖరారు కాగానే కథనం, మాటల కోసం ఓ రెండు వారాలు బ్యాంకాక్ పయనమయ్యే పూరి రాగానే సినిమాని పట్టాలెక్కించేస్తారు. ఇప్పుడూ అదే జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎవరితో అన్నదే తెలిసిరావడం లేదు. మహేశ్ తో చేయాల్సిన ‘జనగణమన’ అతగాడి చేతిలోనే ఉందని పబ్లిక్ గా చెప్పిన పూరి ఎన్టీఆర్ తో మరో సినిమాని చేస్తున్నట్టు వార్తలొచ్చిన అదీ ఫిక్స్ కాలేదన్నారు. ఇక పూరికి సన్నిహితులైన బన్నీ, ప్రభాస్ వంటివారు ఎంత బిజీగా ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. ఈ పరిస్థితుల్లో పూరి సినిమా ఎవరితో అన్నది తెలియాలంటే నవంబర్ నెలాఖరు వరకు ఆగకతప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus