పూరి – కంగనా కలయికలో మరో సినిమా..?

  • November 14, 2016 / 10:37 AM IST

‘ఇజం’ తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ ఎవరితో సినిమా చేస్తున్నారన్న విషయమై ఇటీవల చర్చలు జోరుగా సాగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మొదలు రామ్ వరకు పలువురు హీరోల పేర్లు వినిపించాయి కానీ ఏదీ ఖరారు అయినట్టు చెప్పింది లేదు. ఈ వ్యవహారం ఇలా ఉండగానే ఇప్పుడు మరో ఆసక్తికర వార్త బయటికొచ్చింది. అదే కంగనా – పూరి కాంబినేషన్.”నువ్వూ నటివేనా” అన్న స్థాయి నుండి “నువ్వే నటివి” అనే స్థాయికి చేరుకుంది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.

కెరీర్ ఆరంభంలో తమిళ, తెలుగు భాషల్లో ఒక్కో సినిమా చేసిన ఈ భామ పూరి తెరకెక్కించిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో ప్రభాస్ కి జోడీగా నటించిన ఆ సినిమా ఫలితంతో తర్వాత దక్షిణాదివైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే ఇటీవల బాలీవుడ్ లో మహిళా ప్రాధాన్య చిత్రాలు ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. వాటిలో కంగనా బాగా రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పూరి కూడా అటువంటి కథతోనే కంగనాను సంప్రదించారట. ఆ చర్చల ఫలితంగా వీరిద్దరి కలయికలో సినిమా రానుందని తెలుస్తోంది. కొందరు సినీ పండితులు ‘జ్యోతిలక్ష్మి’ సినిమానే పూరి కంగనాతో రీమేక్ చేస్తాడని అంటున్నారు. ఏమిటన్నది త్వరలోనే స్పష్టమయ్యే అవకాశముంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus