ఆ టైటిల్ పూరి ఎవరి కోసం రిజిస్టర్ చేయించారు?

  • September 8, 2018 / 07:55 AM IST

బద్రి, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, పోకిరి ఇలా వరుసగా విజయాలను అందుకొని తక్కువకాలంలోనే పూరి జగన్నాథ్ స్టార్ డైరక్టర్ అయిపోయారు. ఆ తర్వాత పూరిపై అంచనాలు పెరిగిపోవడంతో బిజినెస్ మ్యాన్, టెంపర్ తప్ప ఆయన దర్శకత్వంలో చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. తాజాగా తన కొడుకు ఆకాష్ ని హీరోగా రీ లాంచ్ చేశారు. సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ తో తనకి సొంతమైన స్టైల్లో ప్రేమకథను తెరకెక్కించారు. భారత్‌ పాక్‌ల యుద్ధ నేపథ్యంలో సాగే కథతో మెహబూబా సినిమాను రూపొందించారు. ఇది కూడా నిరాశపరచడంతో అతనితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ముందుకురావడం లేదు.

యువ హీరోలు కూడా తప్పించుకు తిరుగుతున్నారు. అందుకే తన కొడుకుతోనే మరో మూవీ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ పూరి దృష్టి విజయ్ దేవరకొండ పై పడినట్లు సమాచారం. అతనితో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి రావడానికి చూస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం “వాస్కోడిగామా” అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ టైటిల్ ఆకాష్ కోసమా?, విజయ్ దేవరకొండ కోసమా అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus