పూరి దర్శకత్వంలో వెంకీ 75 వ చిత్రం..?

  • May 7, 2016 / 09:47 AM IST

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాబు బంగారం’ చిత్రం లో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నటిస్తుండగా.. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత కిషోర్ తిరుమల తెరకెక్కించనున్న వెంకీ 74 వ చిత్రంలో ఆయన నటించనున్నాడు.

మరోవైపు వెంకీ75 వ చిత్రంపై  వార్త ఒకటి ఆసక్తికరంగా ఉంది. వెంకీ 75 వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని, ఇటీవలే వెంకిని కలిసిన పూరి ఓ స్టోరీ లైన్ చెప్పగా..ఈ కథ వెంకీకి నచ్చిందని, ఇందులో నటించడానికి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం పూరి, రోగ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత కళ్యాణ్ రామ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus