విదేశాల్లో వార్తల్లోకెక్కిన పూరి “ఇజం”

  • August 24, 2016 / 01:37 PM IST

వేగంగా సినిమాలు తీసే డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ఇజం. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా విదేశీయుల వార్తల్లోకి ఎక్కింది. స్పానిష్ ప్రముఖ న్యూస్ ఛానల్ ఇజం మూవీ షూటింగ్ విశేషాలను ప్రసారం చేసింది. ఈ విషయాన్నీ వీడియో తో సహా డైరక్టర్ పేస్ బుక్ లో పోస్ట్ చేసారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకుని స్పెయిన్ కి వెళ్లిన పూరి టీమ్ ..

అక్కడ కొన్ని ఛేజింగ్ సీన్లతో పాటు, హీరో, హీరోయిన్లు కళ్యాణ్ రామ్, అదితి ఆర్య లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ ని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. దీంతో అక్కడి న్యూస్ ఛానల్ చిత్రీకరణ ఫుటేజ్ తో పాటు డైరక్టర్ పూరి జగన్నాథ్ చెప్పిన సంగతులను ప్రసారం చేసింది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ రిపోర్టర్ బాలకృష్ణ గా సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న”ఇజం” టీజర్ త్వరలో రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus