అందుకే పాన్ ఇండియా స్థాయిలో పూరి తియ్యాలనుకుంటున్నాడట..!

  • June 25, 2020 / 04:40 PM IST

‘జన గణ మన’ అనేది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు డ్రీం ప్రాజెక్ట్ అన్న సంగతి తెలిసిందే. ఈ కథను పూరి ఎప్పుడో తయారు చేసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించాలి అనుకున్నాడు పూరి. కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అలా అని ‘జన గణ మన’ ను పూరి లైట్ తీసుకోలేదు. మహేష్ తో కాకపోయినా సరే ఈ ప్రాజెక్ట్ ను పవన్ కళ్యాణ్, ప్రభాస్,కె.జి.ఎఫ్ హీరో యష్ వంటి స్టార్ హీరోలతో తెరకెక్కించాలి అని ట్రై చేసాడు.

కానీ ఎందుకో ఆ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అయినప్పటికీ పూరి తగ్గలేదు. ‘ఇది నా డ్రీం ప్రాజెక్టు. పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమా.. కచ్చితంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తాను.దాని డీటెయిల్స్ త్వరలోనే ప్రకటిస్తాను’ అంటూ పూరి ఈమధ్యనే మరో సారి చెప్పుకొచ్చాడు. కాగా ‘జన గణ మన’ అనేది ఓపేట్రియాటిక్ సబ్జెక్టు అని తెలుస్తుంది. ఈ మూవీ కంప్లీట్ ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుందని సమాచారం. ‘ఓ పెద్ద ఆర్మీ ఆఫీసర్ కొడుకు కొన్ని కారణాల వల్ల చిన్నప్పుడే తప్పిపోయి పాకిస్థాన్ వాళ్ళకు దొరుకుతాడు.

వాళ్ళు ఇతన్ని ఇండియాకి వ్యతిరేకంగా పెంచుతారు. ఇండియా పై ప్రతీకారం తీర్చుకోడానికి హీరోని వాడుకోవాలని భావిస్తారు. అయితే చివరికి హీరో ఎలా మంచిగా మారాడు? దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అనేది అసలు కథనంగా తెలుస్తుంది. అయితే పూరి ఈ చిత్రాన్ని ఏ స్టార్ హీరోతో తెరకెక్కిస్తాడు? పాన్ ఇండియా లెవెల్లో ఏ నిర్మాత నిర్మిస్తాడు అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది. అది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదేమో..!

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus