ఆ హీరోయిన్ వల్లనే పూరీ నష్ట పోయాడు : పూరీ భార్య!!

  • July 21, 2017 / 06:56 AM IST

టాలీవుడ్ అంతా ఇప్పుడు గందర గోళంగా ఉంది…ఎవరెవరు ఈ డ్రగ్స్ కేస్ లో ఉన్నారో తెలీదు ఆని…బయటపడ్డ 12మందిని మాత్రం సిట్ విచారకు పిలిచి వారి దగ్గర ఉన్న సమాచారాన్ని నోట్ చేసుకుంటుంది..ఇదిలా ఉంటే…ఈ డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పూరీ జగన్నాథ్. ఇప్పటికీ ఈయన సిట్ ముందు హాజరు కావడం, ఆ తరువాత వీడియో సహాయంతో తాను ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పడం…మీడియా పై తన అసంతృప్తిని వ్యక్తం చెయ్యడం తెలిసిందే…అయితే ఇదే క్రమంలో అసలు పూరీ ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడానికి అసలు కారణం ఏంటి అంటే…ఒక హీరోయిన్ అంటున్నారు పూరీ కుటుంబ సభ్యులు…ఎవరు ఆ హీరో హీరోయిన్ ఏమిటి ఆ కధ అంటే…ఒక్కసారి ఈ మ్యాటర్ చదవండి…ఈ వ్యవహారం పై పూరీ భార్య మాట్లాడుతూ…తన భర్త చాలా మంచివాడని తను ఇలా ఈ కేసులో ఇరుక్కోవడానికి కారణం సినీ నటి చార్మీ అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే అధికారికంగా ఈ మ్యాటర్ ఎక్కడ బయట మాట్లాడక పోయినా….ఈ విషయాన్ని ఆమె తనకు తెలిసిన పరిశ్రమ పెద్దల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.

తన భర్తను వాడుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు చార్మి యత్నించిందని, ఆమె మత్తులో పడిన పూరీ ఆసలు సమస్యను విస్మరించాడని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ రాక్షసితో కలవద్దని చెప్పినందుకు ఇంటికి రావడం కూడా మానేశాడని లావణ్య వాపోయిందట. చార్మీతో ఉన్న అనుబంధం కారణంగానే తన భర్త ఫెయిల్యూర్ల బాటలో ఉన్నాడని, ఆర్థికంగా దెబ్బతిని, సర్వనాశనం కావడానికి కూడా ఆమే కారణమని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంత రాద్ధాంతం అవుతున్నా, తన కుటుంబ జీవితం చెడిపోరాదన్న ఉద్దేశంతో భర్తను ఒక్క మాట కూడా అనలేదని లావణ్య చెప్పినట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారం చూస్తుంటే సరికొత్త అనుమానాలు మొదలవుతున్నాయి మీడియా వర్గాల్లో…ఒక పక్క పూరీ నేను అమాయకుణ్ణి అంటుంటే…మరో పక్క అతను భార్య దీనికి కారణం చార్మి అంటుంది…ఏది ఎంతవరకూ నిజమే వారికే తెలియాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus