Pushpa Movie: బన్నీ ఫ్యాన్స్ ను ఖుషీ చేసే అప్డేట్!

  • May 12, 2021 / 06:28 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో మైత్రి మూవీస్ నిర్మిస్తోన్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు రవి శంకర్. ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన ఇప్పటిది కాదని.. గత నవంబర్ లోనే అనుకున్నామని రవిశంకర్ అన్నారు. సినిమా కథకు అంతటి స్పాన్, భారీతనం ఉన్నాయని చెప్పుకొచ్చారు.

రెండు భాగాలుగా తీయడం వలన అదనంగా లాభాలు వచ్చేస్తాయని కానీ.. రెండు సినిమాలు, రెండు బడ్జెట్ లు అంతా దేనికదే అని స్పష్టం చేశారు. మొదటి భాగానికి సంబంధించిన చాలా వరకు వర్క్ పూర్తయిందని.. 110 రోజులకు పైగా షూటింగ్ నిర్వహించామని చెప్పారు. చాలా ఫుటేజ్ ఉందని.. భారీ ఫైట్లు, ఛేజ్ లు, పాటలు ఇలా చాలా ఉన్నాయని చెప్పారు. ఇంకా ఒకటిన్నర పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని.. రెండు భాగాలుగా తీస్తుండడంతో మొదటి భాగంగా ఓ పాట అదనంగా జోడిస్తున్నట్లు చెప్పారు.

అదొక ఐటెం సాంగ్ అని.. ఎవరితో చేయించాలనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. ‘పుష్ప’ రెండు భాగాలు ఒకదాని తరువాత ఒకటి రిలీజ్ అవుతాయని.. రెండో భాగం మొదటి భాగాన్ని మించి ఉంటుందని అన్నారు. మొదటి భాగాన్ని రంపచోడవరం లాంటి చోట్ల తీస్తే.. రెండో భాగం అంతకుమించిన లొకేషన్స్ లో తీస్తామని అన్నారు. మొత్తాన్ని ఈ క్రేజీ న్యూస్ బన్నీ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచేయడం ఖాయం!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus