బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టనున్న జై లవకుశ హీరోయిన్స్!
September 16, 2017 / 08:32 AM IST
|Follow Us
స్టార్ మా ఛానల్ వాళ్ళు భారీ బడ్జెట్ తో నిర్మించిన అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్.. పూర్తి కావడానికి మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇందులో ఎవరు గెలుస్తారా? అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతకంటే ఆసక్తి కలిగించే మరో వార్త ఏమిటంటే.. జై లవకుశ లో నటించిన ఇద్దరు హీరోయిన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారు. అదీ ఈ రోజే. బిగ్ బాస్ షో లో ఇదివరకు రానా, తాప్సీ, అల్లరి నరేష్, సునీల్.. ఇలా చాలామంది సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్ కోసం హౌస్ లోకి వెళ్లి వచ్చారు.
ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేసిన జై లవకుశ ఈనెల 21 న రిలీజ్ కానుంది. ఆ సినిమా ప్రచారం కోసం హీరోయిన్స్ నివేదా థామస్, రాశీ ఖన్నా రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ హోస్ట్ గా హౌస్ బయట ఉండాలి కాబట్టి వీరిద్దరూ హౌస్ లోకి ప్రవేశించి సినిమా విశేషాలను అందరికీ చెప్పనున్నారు. సో ఈరోజు ప్రసారం కానున్న ఎపిసోడ్ నందమూరి అభిమానులను అమితంగా ఆకట్టుకోవడం గ్యారంటీ.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.