అల్లు అరవింద్ తో విబేధాల గురించి వివరించిన రాజమౌళి
May 29, 2017 / 07:55 AM IST
|Follow Us
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గీతా ఆర్ట్స్ బ్యానర్లో మగధీర చిత్రాన్ని తెరకెక్కించారు. రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఏ మూవీ అయినా విజయం సాధించినప్పుడు నిర్మాత, దర్శకుడు మధ్య అనుబంధం పెరుగుతుంది. కానీ అల్లు అరవింద్, రాజమౌళి మధ్య దూరం పెరిగింది. ఈ విభేదాలకు కారణం ఇదేనంటూ అప్పట్లో అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీనిపై జక్కన్న తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఓపెన్ అప్ అయ్యారు.
“మగధీర చిత్రం ప్రారంభంలోనే .. మూవీ పోస్టర్స్ పై సెంటర్స్ సంఖ్య వేయవద్దని అల్లు అరవింద్ కి చెప్పాను. అలాగే అన్నారు. తీరా సినిమా రిలీజ్ అయినా తర్వాత పోస్టర్స్ పై థియేటర్ల సంఖ్యను రాశారు. అది నాకు నచ్చలేదు. అందుకే మగధీర వంద రోజుల వేడుకకు పిలిచినా నేను రానన్నాను” అని వివరించారు. దీంతో వీరిద్దరి మధ్య వైరానికి కారణం అందరికీ తెలిసింది. ఇక బాహుబలి తో దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న రాజమౌళి నెక్స్ట్ సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది. జక్కన్న తర్వాతి సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత అనే విషయం బయటికి వచ్చింది కానీ, హీరో ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.