#RRR పై మరింత శ్రద్ధ పెట్టిన రాజమౌళి

  • August 30, 2018 / 06:06 AM IST

అపజయాలు ఎరుగని డైరక్టర్ రాజమౌళి.. బాహుబలి సినిమాతో ప్రపంచానికి తెలుగువారి సినీ ప్రతిభని చాటారు. అందుకే అతను ప్రస్తుతం చేస్తున్న సినిమాపై అందరి దృష్టి పడింది. స్క్రిప్ట్ దశలోనే అనేక జాగ్రత్తలు తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం ఆర్టిస్టుల సెలక్షన్ విషయంలో శ్రద్ధ పెట్టారు. ఇంతవరకు ఇందులో నటించే హీరోలు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ పేర్లు మాత్రమే అధికారికంగా బయటికి వచ్చింది కానీ.. ఇతర నటీనటుల పేర్లు బయటికి రాలేదు. పీరియాడిక్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రముఖ నటీనటులతో పాటు.. జూనియర్ ఆర్టిస్టులు కూడా ఎక్కువమంది నటించబోతున్నారని తెలిసింది. వారిని కూడా దగ్గరుండి రాజమౌళి సెలక్ట్ చేసినట్టు సమాచారం. ఇప్పుడు వారికి మేకప్ టెస్ట్ చేస్తున్నట్టు ఫిలిం నగరవాసులు చెప్పారు.

సాధారణంగా సినిమాలో ముఖ్యమైన పాత్రలకు మేకప్ టెస్ట్.. స్క్రీన్ టెస్ట్ చేస్తారు. కానీ జూనియర్ ఆర్టిస్టులకు ఈ టెస్ట్ చేస్తున్నారంటే.. ఈ సారి రాజమౌళి గురి ఆస్కార్ మీద ఉందని భావించవచ్చు. ఈ టెస్ట్ లు పాసైన వారికి డైలాగ్ రిహార్సల్స్ కూడ చేయిస్తున్నారంట. అందుకే ఈ మూవీ ఈ డిసెంబర్ లో కూడా సెట్స్ పైకి వెళ్లేట్టు లేదని చెప్పుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్టులకే ఇంత ట్రైనింగ్ ఇస్తుంటే ఎన్టీఆర్, చెర్రీలా ట్రైనింగ్ ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మ్యాసివ్ మల్టీ స్టారర్ మూవీ 2020 సమ్మర్ లో థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus