అభిమానులకు షాక్ ఇచ్చిన రజినీకాంత్!

  • January 17, 2018 / 08:06 AM IST

చైనా వంటకాల మాదిరి కొన్ని నిర్ణయాలు స్వీట్ అండ్ సోర్ గా ఉంటాయి. ఇదే ఫీలింగ్ లో ప్రస్తుతం  రజినీకాంత్ అభిమానులు ఉన్నారు. ఎందుకంటే దక్షిణాది సూపర్ స్టార్ ఇక నుంచి సినిమాలు చేయరని కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. రజినీకాంత్ ఇప్పుడు కమర్షియల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో 2.0 చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్లో రిలీజ్ కానుంది. అలాగే అల్లుడు ధనుష్ నిర్మాణంలో “కాలా” చేస్తున్నారు. దీని తర్వాత ఏ చిత్రాన్ని ఒప్పుకోవడానికి రజినీ ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే ఎన్నికలే కారణం. వచ్చే ఎన్నికల నుంచి సూపర్ స్టార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. సొంత పార్టీ తో పోటీపడనున్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయనున్నారు. అభిమానులు ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని  రజినీకాంత్ ని పిలిచారు. కానీ ఆయన సంశయించారు. రీసెంట్ గా పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు.

దీంతో ఫ్యాన్స్ ఆనందపడ్డారు. వెంటనే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమా చేయరని తెలిసి బాధపడుతున్నారు. ఆయన నేతగా మారితే ఎంతోమంది పేదల బతుకులు మారుతాయనడంలో సందేహం అవసరం లేదు. ఇందుకు సంతోషించాలో, లేక ఆయన స్టైల్ సినిమాలో ఇక చూడలేమని బాధపడాలో తెలియక రజినీ అభిమానులు స్వీట్ అండ్ సోర్ ఫీలింగ్ తో ఉన్నారు. ఒక కంట్లో కన్నీరు .. మరో కంట్లో పన్నీరు మాదిరిగా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus