‘దర్బార్’ సినిమా… ఎలా ఉండబోతుందంటే..?

  • January 4, 2020 / 05:31 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన తాజా చిత్రం ‘దర్బార్’. ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నయన తార హీరోయిన్ గా నటిస్తుండగా నివేదా థామస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అనిరుధ్ సంగీతంలో వచ్చిన పాటలకి మంచి స్పందన లభించింది. జనవరి 9న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. అయితే ఈ చిత్రం ఓ రేంజ్లో ఉండబోతుంది అని స్టేజి ఎక్కిన ప్రతీ ఒక్కరూ చెప్పుకొచ్చారు.

అయితే ఇన్సైడ్ టాక్ వేరే ఉందని సమాచారం. ‘దర్బార్’ చిత్రం ఫస్ట్ హాఫ్ బాగా వచ్చిందట. దర్శకుడు మురుగదాస్ రజినీ అభిమానులకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఫస్ట్ హాఫ్ లో రంగరించారట. అయితే సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం ఆయన బ్యాలన్స్ తప్పారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రజినీ కాంత్ అలాగే విలన్ సునీల్ శెట్టి ల మధ్య వచ్చే సీన్స్ తప్ప.. సెకండ్ పెద్దగా మెప్పించే విధంగా లేదని తెలుస్తుంది. ‘పేట’ మాదిరి ఈ చిత్రం కూడా యావరేజ్ గా నిలిచే అవకాశం ఉందని ఫిలింనగర్లో టాక్ వినబడుతోంది. అయితే రజినీ ఫ్యాన్స్ ను మాత్రం ఈ చిత్రం మెప్పిస్తుందని వారు చెబుతున్నారు. మరి ఈ టాక్ లో ఎంత వరకూ నిజముందో.. జనవరి 9న తేలిపోతుంది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus