రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ రెచ్చిపోయిందిగా..!

  • August 6, 2019 / 04:35 PM IST

ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ కు అస్సలు హిట్లు లేవు. దీంతో ఆమెకు అవకాశాలు కూడా కరువయ్యాయి. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ ‘మన్మధుడు2’ పైనే పెట్టుకుంది. నాగార్జున,రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 9 న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో అవంతిక గా కనిపించబోతుంది రకుల్. అయితే విడుదల చేసిన టీజర్లో ఆమె సిగరెట్ కాలుస్తూ కనిపించింది. దీంతో ఆమె పై ట్రోలింగ్ మొదలైంది. ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేయగా… తెగ ఫైర్ అయ్యింది ఈ భామ. ‘మన్మధుడు2’ ప్రమోషన్లలో భాగంగా… రకుల్ మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా.. ఓ రిపోర్టర్ ‘సినిమాలో కాస్త బోల్డ్ గా నటించినట్లున్నారు..’ అని ప్రశ్నించగా.. వెంటనే రకుల్ మండిపడింది.

రకుల్ మాట్లాడుతూ.. ” మీరు.. దేని గురించి అడుగుతున్నారో నాకు తెలుసు. ఈ చిత్రంలో సిగ‌రెట్ తాగిన సీన్ ఉంది. దాని కోస‌మే క‌దా? సిగ‌రెట్లు తాగితే బోల్డ్‌నెస్ అయిపోతుందా? అవంతిక అనే అమ్మాయి సిగ‌రెట్లు తాగ‌డం గురించిన క‌థ కాదిది. సిగ‌రెట్లు తాగే అల‌వాటున్న అవంతిక క‌థ ఇది. అయినా హీరోలు సిగ‌రెట్ కాలిస్తే త‌ప్పు లేదు కానీ.. హీరోయిన్లు కాలిస్తే త‌ప్పొచ్చిందా? బ‌య‌ట స‌మాజంలో, రోడ్డు మీద ఇంకా చాలా చాలా విష‌యాలే జ‌రుగుతున్నాయి. వాటి గురించి ఎవ్వ‌రూ మాట్లాడ‌రు. సినిమాలో కాస్త బోల్డ్‌నెస్ చూపించ‌గానే సంస్క్రృతి, సంప్ర‌దాయాలు గుర్తుకొచ్చేస్తాయి. సినిమాల ద్వారా చెడు అల‌వాట్ల‌ని ప్రోత్స‌హించ‌డం లేదు. అలాంటి స‌న్నివేశాలు వ‌స్తున్న‌ప్పుడు మ‌ద్య‌పానం, ధూమ‌పానం హానిక‌రం అని స్లైడింగ్ కూడా వేస్తున్నాం క‌దా?” అంటూ ఘాటుగా జవాబిచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus