ఇక షూటింగ్ లో బిజీ కానున్న చెర్రీ..!

  • March 31, 2016 / 10:37 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటి వరకు తన సోదరి శ్రీజ వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆమె వివాహ కార్యక్రమం ముగియడంతో ఇక చిత్రాల్లో బిజీ కానున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనిఒరువన్ తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పటికే అరవింద్ స్వామిపై పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించగా.. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానున్న మేజర్ షెడ్యూల్ లో చెర్రీపై పలు సన్నివేశాలను తెరకెక్కించనునన్నట్లు సమాచారం. ఏప్రిల్ 7 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రానికి ‘ధృవ’ అనే టైటిల్ పరిశీలిస్తుండగా.. తమిళంలో ఈ చిత్రం హిట్ కొట్టగా తెలుగులోనూ ఈ చిత్రం విజయం సాధిస్తుందని చిత్ర బృందం విశ్వాసంగా ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus