పవన్ కళ్యాణ్ సినిమా గురించి నన్ను అడిగారు.. కానీ : రానా

  • November 9, 2020 / 04:33 PM IST

మలయాళంలో సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్’ ను తెలుగులో‌ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీస్ పాత్రకు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ఎంపికయ్యారు. మలయాళంలో ఈ పాత్రను బీజు మీనన్ పోషించారు. ఇక పృథ్వీరాజ్‌ పాత్రలో రానా ను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ నిర్మాతలు అధికారికంగా ప్రకటించకపోవడంతో రానా ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడనే ప్రచారం జరుగుతుంది. నిజానికి ఈ రీమేక్ ఉంటుంది అని వార్తలు మొదలైనప్పుడు…

రానా పేరే మొదట వినిపించింది. కానీ నిర్మాతలు మొదట రానా పేరు కాకుండా పవన్ కళ్యాణ్ పేరునే ఖరారు చేశారు. ఈ విషయం పై రానా నే ప్రశ్నించగా.. ఇలా స్పందించాడు.’ ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్’ రీమేక్లో ఓ పాత్ర కోసం దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించిన మాట నిజమే. కానీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఈ చిత్రంలో నటించాలని నాకూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు రానా. అటు అవునని కాకుండా..

ఇటు కాదని కాకుండా చాలా తెలివిగా జవాబిచ్చి తప్పించుకున్నాడు రానా. మరి నిర్మాతలైన ఈ విషయం పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ‘సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus