రానాకి ఇంత బడ్జెట్ పెట్టడం అవసరమా..?

  • December 27, 2018 / 07:27 AM IST

రానా ప్రస్తుతం ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించడానికి సిద్దమయ్యాడు. ఈ చిత్రంలో రానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ అల్లుడు అయిన నారా చంద్రబాబు నాయుడు పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత రానా ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్టు సమాచారం. రానా ‘బాహుబలి’ చిత్రంలో ‘భల్లాలదేవుడు’ పాత్రతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రానా నటించే చిత్రాలకు మంచి మార్కెట్ ఏర్పడింది.

ప్రస్తుతం ఓ క్రేజీ చిత్రంలో నటించబోతున్నాడట. ‘నీది నాది ఒకే కథ’ అనే డీసెంట్ హిట్ ను సాధించిన డైరెక్టర్ వేణు ఉడుగుల రానాతో ఓ పీరియాడిక్ మూవీ తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రానికి విరాటపర్వం 1992 అనే టైటిల్ అనుకుంటున్నట్టు టాక్. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకుంటున్నారట. ‘ఫిదా’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించింది సాయిపల్లవి. రానా -సాయి పల్లవి కాంబినేషన్ కావడంతో ఈ చిత్రం పై మంచి హైప్ ఏర్పడే అవకాశం కచ్చితంగా ఉందనే చెప్పాలి. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే మొదట ఈ చిత్రానికి శర్వానంద్ ను సంప్రదించాడట డైరెక్టర్ వేణు. శర్వానంద్ కు ఇలాంటి కధల పై ఆసక్తి లేదని చెప్పడంతో రానా ని లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో ప్రటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus