ప్లాప్ సినిమాకి సక్సెస్ టూర్లెందుకు రష్మిక..!

  • July 30, 2019 / 03:26 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. జూలై విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో చిత్రయూనిట్ సభ్యులు ఈ చిత్రానికి రిపేర్లు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 15 నిమిషాల నిడివి తగ్గించారు. ఎంత తగ్గించినా కలెక్షన్లు మాత్రం అనుకున్న స్థాయిలో లేవు. సో ప్లాన్ ‘ఏ’ ఫెయిలయ్యింది. దీంతో సక్సెస్ టూర్ల పేరుతో ‘ప్లాన్ బి’ అమలు చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ఫిక్సయ్యారట.

రష్మిక ట్వీట్ తో ఈ విషయం పై క్లారిటీ వచ్చింది. రష్మిక తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ… ” ‘డియర్‌ కామ్రేడ్‌’ టీం మీకు థియేటర్లో సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. అదేంటో నేను చెప్పను. మీరే చూసి తెలుసుకోండి. మీ సూచనలను పరిగణలోకి తీసుకున్నాం. ఇంతకు మించి నేనేం చెప్పలేను’ అంటూ ట్వీట్ చేసింది. అయితే రష్మిక ట్వీట్ పై కొన్ని సెటైర్లు కూడా పడుతున్నాయి. ‘ప్లాప్ సినిమాకి సక్సెస్ టూర్లు అవసరమా రష్మిక’ అంటూ కొంతమంది నెటిజన్లు ప్రశ్నింస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus