అందరినీ చితక్కొట్టాలనుందంటున్న రష్మిక..!

  • February 21, 2019 / 12:24 PM IST

నాగ శౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది రష్మిక మందన. చేసిన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ని అందుకోవడమే కాదు, తన నటనతో కూడా ఆకట్టుకుంది. ఇక అటు తరువాత ‘గీత గోవిందం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక టాలీవుడ్ లో రష్మిక కు హీరోయిన్ గా మంచి అవకాశాలే వస్తున్నప్పటికీ …. తనకి మాత్రం విలనీగా చేయాలని కోరికగా ఉందట.

తాజాగా రష్మిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా… ‘మీకు ఎలాంటి పాత్రలంటే ఇష్టం?’ అని రష్మిక ను అడుగగా… ఓ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఈ ప్రశ్నకి రష్మిక జవాబిస్తూ… ” హీరోయిన్‌గా అన్ని పాత్రలూ చేయాలనుంది. విలనీగా చేయాలన్నది నా కోరిక. విలనీగా అంటే చెడ్డ విలనీ కాదు, మంచి విలనీ అన్నమాట. అందర్నీ చితకొట్టాలనుంది. నా రూపం అందుకు సహకరించదేమో అన్న అనుమానం మీకు అక్కర్లేదు. నా నటనతో అందర్నీ మెప్పించగలను అన్న నమ్మకముంది. ఇప్పటి వరకూ నేను కొత్త కాబట్టి, జస్ట్ డైరెక్టర్స్ ఎలా చెప్తే అలాగే నటించాను. నటనలో నా స్టయిల్‌ అంటూ ఏదీ ఏర్పర్చుకోలేదు. ఇప్పుడు నా మీద నాకు నమ్మకం పెరిగింది. దానికి తోడు కొంత అనుభవం కూడా వచ్చింది. నా తరువాతి సినిమాల్లో రియల్ రష్మికను చూస్తారు” అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus