పది నెలలు గ్యాప్ తర్వాత ఈ ఎంట్రీ ఇస్తున్న రష్మిక లవర్?

  • June 4, 2019 / 06:17 PM IST

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇప్పటివరకూ మీడియం హీరోల సరసన మాత్రమే నటిస్తూ వచ్చిన రష్మిక.. ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘మహేష్ 26’ గా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంలో హీరోయిన్ ఎంపికయ్యింది రష్మిక. ఈ చిత్రంతో పాటూ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కబోయే చిత్రంలో కూడా రష్మిక నే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని సమాచారం.

ఇదిలా ఉండగా… గతంలో ఈ కన్నడ భామ నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించి, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. వీరిద్దరికీ నిశ్చితార్ధం కూడా అయ్యింది. కానీ క్యాన్సిల్ అయ్యింది. టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో రష్మిక ఇలా బిజీ కావడమే అందుకు కారణమని కామెంట్స్ వినిపించాయి. రష్మికతో బ్రేకప్ తరువాత సోషల్ మీడియాలో ఈ జంట గురించి తెగ డిస్కషన్లు జరిగాయి. దీంతో రక్షిత్ శెట్టి సోషల్ మీడియా నుండి ఎగ్జిట్ అయ్యాడు కూడా. గత పది నెలలుగా తన అకౌంట్ ను డీయాక్టివేట్ చేసే ఉంచాడు. అయితే ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట. జూన్ 5న రక్షిత్ శెట్టి పుట్టిన రోజు కావడంతో మళ్ళీ సోషల్ మీడియాలోకి రావాలని నిర్ణయించుకున్నాడట. రష్మిక,తనకి బ్రేకప్ కు సంబంధించి అనేక ప్రశ్నలు రావడం.. ఈ కారణంగానే… తన వర్క్ పై సరిగ్గా ఫోకస్ పెట్టలేక సోషల్ మీడియాకి దూరమయ్యాడట. ఇప్పడు తిరిగి రీఎంట్రీకి సిద్ధమయ్యాడన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus