‘పొగరు’ ప్రమోషన్స్ కు రష్మిక దూరం.. కారణం అదేనట..!

  • February 18, 2021 / 04:36 PM IST

‘కె.జి.ఎఫ్’ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వడంతో కన్నడంలో కూడా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైంది. ఈ నేపథ్యంలో సుదీప్ ‘పహిల్వాన్’, రక్షిత్ శెట్టి ‘అతడే శ్రీమన్నారాయణ’ వంటి సినిమాలు కూడా తెలుగులో విడుదలయ్యాయి. కానీ అవేమి విజయవంతం కాలేకపోయాయి. అయినప్పటికీ కొంతమంది కన్నడ హీరోలు తెలుగులో రాణించాలని ట్రై చేస్తున్నారు. ఈ లిస్ట్ లో అర్జున్ మేనల్లుడు ధృవ్ షార్జా కూడా ఉన్నాడు. అతను నటించిన ‘పొగరు’ చిత్రం తెలుగులో ఫిబ్రవరి 19న విడుదల కాబోతుంది.

‘కరాబు మైండ్ కరాబు’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యి యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ నమోదు చెయ్యడంతో ఈ చిత్రం పై అందరి ఫోకస్ పడింది. అందులోనూ రష్మిక మందన హీరోయిన్ కావడంతో తెలుగులో ఈ చిత్రాన్ని రూ.3కోట్ల పైనే పెట్టి కొనుగోలు చేశారు. కానీ ఈ చిత్రం ప్రమోషన్లకు రష్మిక హ్యాండిచ్చింది. దానికి కారణం రష్మికకు ఖాళీ లేకపోవడమే అని తెలుస్తుంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘మిష‌న్ మ‌జ్ను’, తెలుగులో అల్లు అర్జున్-సుకుమార్ ల ‘పుష్ప‌’,

తమిళంలో కార్తి హీరోగా తెరకెక్కుతోన్న ‘సుల్తాన్‌’ వంటి చిత్రాల షూటింగ్లతో బిజీగా గడుపుతుంది. అందుకే ‘పొగరు’ ప్రమోషన్స్ కు ఆమె రాలేకపోతుందట.దీంతో ఇక్కడి బయ్యర్లకు టెన్షన్ మొదలైంది.ఆమెకి ఇక్కడ ఉన్న స్టార్ స్టేటస్ కారణంగానే.. అంత పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేశామని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ చిత్రం ద‌ర్శ‌కుడు నంద కిషోర్ మాత్రం రష్మిక ప్రమోషన్లలో పాల్గొంటుందని చెబుతున్నాడు.అయితే రేపే సినిమా విడుదల.. టాక్ కనుక నెగిటివ్ గా వస్తే రష్మిక ప్రమోషన్ చేసినా ఉపయోగం ఉండదు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus