మీడియాపై మండి పడ్డ గీత గోవిందం బ్యూటీ

  • September 18, 2018 / 06:24 AM IST

విజయాలు.. వివాదాలు.. కొన్నిసార్లు రైలు పట్టాల మాదిరిగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే విజయం పక్కనే వివాదం నడుస్తూ ఉంటుంది. ఇది అనేకమంది విషయాల్లో నిజమని తేలింది. ముఖ్యంగా సినిమా తారల విషయాల్లో సహజంగా జరుగుతూ ఉంటాయి. తాజాగా కన్నడ నటి రష్మిక విషయంలో జరిగింది. ఛలో  సినిమా ద్వారా తెలుగులో అడుగు పెట్టిన ఈ బ్యూటీ గీత గోవిందం సినిమాతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆమె చేతినిండా సినిమాలున్నాయి. అయితే తాను ప్రేమించి,  నిశ్చితార్థం చేసుకున్న రక్షిత్‌ మాత్రం చేయిని వదిలేశారు. ఇద్దరూ మాట్లాడుకొని విడిపోయారు. ఈ విషయంపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు రష్మిక తన గురించి వస్తున్న వార్తలపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. “అందరికీ నమస్కారం. ఇంతకాలం నా వ్యక్తిగత విషయాల్లో నేను మౌనం వహించినందుకు నన్ను క్షమించండి. నా గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి.

అవన్నీ నన్ను తప్పుగా చూపిస్తుండడంతో నేను డిస్టర్బ్‌ అవుతున్నాను. ఈ విషయాలన్నీ చాలా దూరం వెళ్లిపోయాయి. ఇందుకు మిమ్మల్ని వేలెత్తి చూపాలనుకోవడంలేదు. ఎందుకంటే మీరు అలాంటివే నమ్ముతారు. ఈ వార్తల గురించి మీ అందరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీ అందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. రక్షిత్‌, నేనే కాదు.. సినీ పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరూ మాలాగా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోకూడదు. ఒక నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్లు ప్రతి కథకు రెండు రూపాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మా పనిని ప్రశాంతంగా చేసుకోనివ్వండి” అని రష్మిక వేడుకున్నారు. తామిద్దరం విడిపోయినప్పటికీ సినీ పరిశ్రమని వదిలి వెళ్లాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus