రవితేజ రిస్క్ చేస్తున్నాడా…?

  • March 1, 2019 / 03:02 PM IST

మాస్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ అంటే డైరక్టర్ వివి వినాయక్ పేరు చెప్పేవారు. హీరో ఇమేజ్‌కు తగ్గట్లుగా మాస్ అంశాలు జత చేసి హిట్ కొట్టడంలో వివి వినాయక్‌ సిద్ధహస్తుడు. అప్పట్లో వినాయిక్ తో సినిమా చేయడానికి హీరోలు ఎగబడేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇటీవల వినాయక్ చిత్రాలు ‘అఖిల్’ ‘ఇంటిలిజెంట్’ డిజాస్టర్లు గా మిగిలాయి. మధ్యలో ‘ఖైదీ నెంబర్ 150’ హిట్టయినా… అది మెగాస్టార్ అకౌంట్లో కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకూ వినాయక్ వెయిటింగ్ లిస్ట్ లో ఉండిపోయాడు. అయితే ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడని తాజాసమాచారం.

మాస్ మహా రాజ్ రవితేజ హీరోగా వినాయక్ డైరెక్షన్లో ఓ చిత్రం రూపొందనుందని తెలుస్తుంది. ఇటీవలే వినాయక్ రవితేజని కలిసి స్క్రిప్ట్‌ని వినిపించాడట. స్క్రిప్ట్ నచ్చడంతో రవితేజ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. ఈ మధ్య రవితేజ కి కూడా హిట్టు లేదు. గతేడాది రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ ‘నేల టికెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాలు డిజాస్టర్లు గా మిగిలాయి. ఇప్పుడు వినాయక్, రవితేజ ఇద్దరికీ ఓ హిట్టు కావాలి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘కృష్ణ’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. సో వీరిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. సరైన కథ ఉండాలే గాని దాన్ని తెరకెక్కించడంలో వినాయక్ ఏమాత్రం తీసిపోడు. సో రవితేజకి ఇది రిస్క్ ఏమీ కాదు. ఇక ప్రస్తుతం రవితేజ విఐ ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజా’ చిత్రం చేస్తున్నాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus