ప్రారంభమైన రవితేజ, వి ఐ ఆనంద్, “డిస్కోరాజా”

  • March 5, 2019 / 12:13 PM IST

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”. ఈ చిత్రం ప్రారంభోత్సవం మహా శివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమాలతో సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగింది. నిర్మాత రజని తాళ్ళూరి క్లాప్ కొట్టగా… రామ్ తాళ్ళూరి కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రం లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రేపటినుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారు. నేల టిక్కెట్ తర్వాత ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి… రవితేజ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ… ముందుగా తెలుగు ప్రేక్షకులందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు. నేల టిక్కెట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ గారితో మేం నిర్మిస్తున్న డిస్కో రాజా చిత్రాన్ని ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టాం. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నాం. పాయల్ రాజపుత్, నభా నటేష్ హీరోయిన్లు. దర్శకుడు వి ఐ ఆనంద్ చెప్పిన కథ అద్భుతంగా ఉంది. మా బ్యానర్ విలువను రెట్టింపు చేసే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. పేరుకు తగ్గట్టే అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమా ఉండనుంది. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus