వర్మ ఈవెంటుకి ప్రభాస్ ని రాకుండా చేసిన రాజమౌళి

  • December 23, 2016 / 10:17 AM IST

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం వంగవీటి రిలీజ్ సందర్బంగా రెండు రోజుల క్రితం  ‘శివ టు వంగవీటి.. ద జర్నీ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ’ అనే  పేరుతో జూబ్లీ హిల్స్ లోని జీఆరేసీ కన్వెన్స్ సెంటర్ లో భారీ వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథులుగా బిగ్ బీ అమితాబ్, కింగ్ నాగార్జున హాజరుకావాల్సింది. ఫ్లయిట్ మిస్ కావడంతో అమితాబ్ రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ఇక ఈ వేడుకకు వర్మ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన దర్శకులతో పాటు దర్శకధీరుడు రాజమౌళి హాజరయ్యారు. అయితే కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వస్తారని ప్రచారం జరిగింది. ఆయన రావడానికి కూడా రెడీ అయ్యారంట. అయితే బిగ్ బీ ఫ్లయిట్ కాన్సల్ అయిందనే వార్త తెలియడంతో ప్రభాస్ ని రావద్దని జక్కన్న చెప్పారంట.

బిగ్ బీ కి, డార్లింగ్ కి సంబంధం ఏమిటని ఆరా తెస్తే రాజమౌళి మాస్టర్ ప్లాన్ బయటపడింది. అమితాబ్ వేడుకకు వస్తే ఆయనతో ప్రభాస్ ని కూర్చోబెట్టి, బాహుబలి విశేషాలను మాట్లాడాలని అనుకున్నారు. అలా సినిమా గురించి చర్చించే అవకాశం దొరుకుతుందని భావించారు. అంతేకాకుండా బాలీవుడ్ సూపర్ స్టార్ నోటి నుంచి బాహుబలి మాట వస్తే దేశవ్యాప్తంగా ప్రచారం వస్తుందని అంచనా వేశారు. ఉచితంగా పబ్లిసిటీ అయ్యే ఛాన్స్ ని వదులుకోకూడదని ప్లాన్ వేశారు. కానీ బిగ్ బీ రాకపోవడంతో అంచనాలు తలకిందులయ్యాయి. సో పబ్లిసిటీ రాని దానికి ప్రభాస్ ఎందుకని అతన్ని వేడుకకు రానివ్వలేదని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఇదండీ స్టోరీ.. ఎంతయినా రాజమౌళీ ఘటికుడే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus