సుజీత్ మూవీని ముందే మొదలెట్టనున్న ప్రభాస్

  • March 10, 2017 / 06:42 AM IST

ప్రభాస్ నటించిన బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. యంగ్ రెబల్ స్టార్  దీని తర్వాత  సుజీత్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లలో వంశీ, ప్రమోద్ లు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ త్రిభాషా చిత్రం  పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ వచ్చింది. ఈ నెల లోనే ప్రభాస్ 19 సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ తొందర వెనుక కారణం ఏమిటని ఆరా తీయగా అసలు విషయం బయట పడింది.

ప్రభాస్, సుజీత్ కాంబోలో రానున్న మూవీ టీజర్ ని బాహుబలి 2 మూవీ విశ్రాంతి సమయంలో థియేటర్లలో ప్రదర్శించాలని భావిస్తున్నారు. అందుకోసం యంగ్ రెబల్ స్టార్ పై కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేసి టీజర్ సిద్ధం చేసే పనిలో డైరక్టర్ పడినట్లు తెలిసింది. సో బాహుబలి కంక్లూజన్ తో పాటు డార్లింగ్ 19 మూవీ టీజర్ ని చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus