కొత్త లుక్ కోసం అమెరికా వెళ్ళిన సాయిధరమ్ తేజ్!

  • July 16, 2018 / 01:06 PM IST

ఒక రెండేళ్ల క్రితం నాని తర్వాత ఆ రేంజ్ హీరో ఎవర్రా అంటే అందరికీ ఇమ్మీడియట్ గా గుర్తొచ్చే కథానాయకుడు సాయిధరమ్ తేజ్. అలాంటిది ఏకంగా వరుసగా 6 ఫ్లాపులతో ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు. గతంలో 25 కోట్లు మార్కెట్‌ ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ చిత్రాలకి ఇప్పుడు కనీసం అయిదు కోట్ల షేర్‌ కూడా రాకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

అందుకే స్క్రిప్ట్ సెలక్షన్స్ లో భారీ ఛేంజ్ తోపాటు.. లుక్స్ & బాడీ విషయంలోనూ ఛేంజ్ చాలా అవసరమని భావించాడట. అందుకే యుఎస్‌ లోని ట్రెయినర్లు, డాక్టర్ల సహాయంతో బరువు తగ్గడానికి సాయి ధరమ్‌ తేజ్ అమెరికాలో మూడు నెలలు ఉండబోతున్నట్లు టాక్. తన ఫిజిక్ లో కొంత మార్పు వచ్చాక ‘చిత్రలహరి’ మొదలుపెట్టాలని తేజ్ ప్లాన్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న. “చిత్ర లహరి”లో సాయి ధరమ్‌ తేజ్ సరసన “హలో” ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్‌, “గురు” ఫేమ్ రితికా సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus