తెలుగు సినిమా కూడా హాలీవుడ్ స్థాయికి చేరుకోవాలి!

  • February 5, 2020 / 09:28 AM IST

ప్రముఖ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరియు ‘కింగ్’ నాగార్జునను కలవడంతో పెద్ద చర్చ మొదలైంది. టాలీవుడ్ లో ఏ చిన్న సమస్య వచ్చినా.. తలసాని ముందుకొచ్చి పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి అంశం పైన చర్చించడానికే…. ఇప్పుడు చిరు, నాగ్ లతో భేటీ అయ్యారా అని డిస్కషన్లు మొదలయ్యాయి. అసలు విషయం ఏమిటంటే.. చిరంజీవి నివాసంలో ఈ భేటీ నిర్వహించారు. నంది అవార్డులు, సినీ కార్మికుల మధ్య సమస్య, చిత్ర పరిశ్రమ అభివృద్ధి.. వంటి అంశాల పై చర్చ జరిగిందట.

నంది అవార్డుల విషయంలో ఇప్పటికే అనేక వివాదాలు చోటుచేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. వాటి పై తలసాని ప్రస్తావించారట. అంతేకాకుండా.. ‘పెద్ద సినిమాలు విడుదలవుతున్న సమయంలో చిన్న చిత్రాలకు థియేటర్ల కొరత ఏర్పడుతోందని విన్నపించారట. వీటితో పాటు ‘మా’ అసోసియేషన్ లో గొడవలు, చిత్రపురి కాలనీలో వివాదాలు ఇలా టాలీవుడ్ లో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పారట. ఈ అంశాలు మన టాలీవుడ్ ఇండస్ట్రీని దెబ్బ కొట్టేలా ఉండకూడదని… మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా హాలీవుడ్ స్థాయికి చేరుకోవాలని.. దానికి అందరం కలిసి పనిచేయ్యాలని కోరుకుంటున్నట్టు తెలిపారట.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus