Puneeth Rajkumar: కోలీవుడ్ స్టార్స్ ను ఆపేసిన కావేరీ జలాల గొడవ!

  • November 2, 2021 / 02:08 PM IST

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం మొత్తం సినీ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టేసింది. నలభై ఏళ్ల వయసులోనే పునీత్ గుండెపోటుతో మరణించడం అందరినీ కలచివేస్తుంది. పునీత్ కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. అతడి మిగిలిన ఇండస్ట్రీ హీరోలతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. పునీత్ మరణవార్త తెలుసుకున్న తరువాత చాలా మంది సినీ ప్రముఖులు బెంగుళూరు చేరుకొని పునీత్ కు నివాళులు అర్పించారు. పునీత్ అంత్యక్రియలకు లక్షల మంది అభిమానులతో పాటు టాలీవుడ్ నుంచి చిరంజీవి,

బాలకృష్ణ, ఎన్టీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కంఠీరవ స్టేడియంలో పునీత్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అయితే కోలీవుడ్ నుంచి మాత్రం ఒక్కరు కూడా హాజరుకాలేదు. నిజానికి తమిళ హీరోలు విశాల్, సూర్య, విజయ్ వంటి హీరోలతో పునీత్ రాజ్ కుమార్ కి మంచి స్నేహం ఉంది. అయినా వాళ్లు చివరిచూపు చూడడానికి రాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తమిళ హీరోలను ట్రోల్ చేశారు. అయితే దీనికి కారణం కావేరీ జలాల సమస్య అని తెలుస్తోంది.

కొన్ని సంవత్సరాలుగా కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం నడుస్తుంది. ఆ మధ్య తమిళ సినిమాలను కర్ణాటకలో విడుదల చేయకూడదని అప్పట్లో కన్నడ హీరోలు నినాదాలు కూడా చేశారు. దీంతో ఇలాంటి సమయంలో పునీత్ అంత్యక్రియలకు హాజరైతే రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయని ఉద్దేశంతోనే కోలీవుడ్ హీరోలు హాజరు కాలేదని సమాచారం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus